పుట:సకలనీతికథానిధానము.pdf/52

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

సకలనీతికథానిధానము


గొడ్డు తనతల్లియని కన్నకొడుకు చెప్పు
మాట నిజమయ్యె నిచ్చోట మనుజనాథ.

265


దోదకం.

ఈజగ మంతయు నేలుచు నాయీ
రాజముఖంబరి రంభణ సేయన్
తేజము గాదిది తే నావనితన్
రాజులు గోరిన రామలు లేరే.

266


వ.

అనవుఁడు.

267


క.

నివ్వెరపడి (జనపతి యిపు)
డెవ్విధమున నిత్తు వీని యిందునిభాస్యన్
నవ్వో నిజమో యని మది
నెవ్వగచే మాటలాడ నేరక యున్నన్.

268


ఆ.

అంత నింద్రజాలి యామాయ లెల్లను
దలగబెట్టి వచ్చి నిలుచుటయును
పాండ్యనృపతి తన కుపాయన మిచ్చిన
మేటివస్తుచయము మెచ్చి యిచ్చె.

269


వ.

అదియునుఁ గాక.

270


క.

పేదలగు విప్రు లడిగిన
నాదరణముతోడ నల్పమధికం బన కా
హ్లాదమున నిచ్చువాఁ డా
యాదిమదా తనుచు నుందు రార్యజనంబుల్.

271


వ.

ఈయర్థంబు దెలుపు నితిహాసంబు వినుమని యిట్లనియె.

272