పుట:సకలనీతికథానిధానము.pdf/38

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

సకలనీతికథానిధానము


తే.

భూమిసురు గొంచు నచటికి బోయి యతివ
యొద్ద నారాత్రి వసియింపను దరి యసుర
వచ్చుటయు వాని వధియించి వారసతిని
భూసురున కిచ్చి చనుదెంచె బురమునకును.

182


వ.

అని యుపన్యసించి వెండియు దచ్చరిత్రంబు వినుమని నారదుం డిట్లనియె.

183


ఆ.

తపముచేసియైన జపములచేనైన
పొందుఫలముచేత భూమిజనుల
మరణరోగజరల మాన్పునుత్తములకు
నిందునందు సుఖము లంద గలుగు.

184


వ.

అది యెట్లనిన.

185


సీ.

ఉజ్జయనీపురి కొకదిగంబరముని
        యరుగుదెంచిన విక్రమార్కనృపతి
పిలువబంచుటయు నిస్పృహుడగు నమ్ముని
        రాకున్న దాబోయి యాకపర్ది
గనుగొని మ్రొక్క తత్కాయసిద్ధికి మెచ్చి
        యతని యాయుర్భావ మడుగుటయును
యోగికిం బేరు నాయుష్యంబు వలసిన
        జచ్చు నొల్లకయున్న జావఁ డనుచు


ఆ.

నొక్కసిద్ధమంత్ర ముపదేశ మిచ్చిన
నడవి కరిగి దాన నచట వ్రేల్ప
భవుడు మెచ్చి యొక్కఫల మిచ్చి యిది తిను
మరణరుజలు నీకు మాను ననుచు.

186