పుట:సకలనీతికథానిధానము.pdf/299

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

293


తత్సుత శ్రీవనితాకృతి ధరియించి
        నటియింప బతి భీమభటుఁడు గదిసి
క్రీడారణంబున గేడించి లాసికా
        సుతుఁ జంపుటయు భూమిపతిఁ దలంకి


కొడుకు బురము వెళ్లగొట్టి కనిష్ఠునిఁ
బ్రభువుఁ జేయ భీమభటుని హితుఁడు
శంఖదత్తుఁడనెడి సద్విజుఁ డరుదేర
నన్యదేశమున కరుగు నపుడు.

200


ఆ.

వణిజుఁడొకఁడు సింధువాహంబు దెచ్చిన
భీమభటుఁడు దానిఁ బ్రేమ గొనిన
ధరపుపిన్న(?) కొడుకు నావాడునర్తకి
తనయుఁ డనుచు బాహుదర్ప మమర.

201


క.

భీమభటుమీఁద నడిచిన
భూమిపునకు వెఱచి జ్యేష్ఠపుత్రుఁడు నగరీ
సీమంబు వెడలి తురగము
నామిత్రుఁడు తోడరాగ నరిగి యొకడవిన్ (?)

202


క.

హరికంఠ కహకహారవ
మురవడిమ్రోయుటయు దురగ మోర్వక పడినన్
దురగంబు విడిచి నిజపద
చరణం జని నీలకంఠసంయమి గాంచెన్.

203


వ.

తదనుమతంబున స్నానార్థంబు గంగాప్రవేశంబు చేసిన.

204


క.

మిత్రుని మీను మ్రింగిన
ధాత్రీవరసుతుఁడు శోకతప్తుం డగుచున్
దత్త్రిపథగాంబులం దన
గాత్రంబును విడువఁదలఁప గంగయుఁ బలికెన్.

205


వ.

ఈసాహసంబు వలవదు ప్రతిలోమానులోమోచ్చారణంబున స్వేచ్ఛాకృతిప్రధానమగు మంత్రం బిచ్చెదం గొనుమని యుపదేశించినం గైకొని యమ్మహానది వీడుకొని లాటదేశంబునకుం జని యందు.

206