పుట:సకలనీతికథానిధానము.pdf/243

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

237


వ.

అని చెప్పిన కందుకావలిం బొందు మాయోపదేశంబు చేసి రాక్షసి చనియె నేనును నక్కందుకావతిని భోగించి దానితండ్రిం జంపి యతనిరాజ్యమున కభిషిక్తుండనై సింహవర్మకుఁ దోడు వచ్చి నిన్ను బొడగంటిననియె నంత.

277


సీ.

మాతృగుప్తుండను మంత్రివుత్రునిఁజూచి
        యెచటికిఁ బోయి నీ వేమి చేసి
తనిన నేనొకపురి యర్ధరాత్రం బొక
        సిద్ధుండు హేమంబు సేయ నాతఁ
డెఱుఁగనిచో డాఁగి యే నుండి మఱివాఁడు
        దైత్యుఁ బుట్టించి కర్దమునివనితఁ
దెమ్మన్న నటవోయి తెచ్చునంతకుఁ ద్రోవ
        కడ్డంబు చని యేను నబ్జముఖిని


నచ్చటనె పెట్టి నిన్ను రమ్మనియె సిద్ధు
డనిన న దియట్ల చేయ నయ్యతివ విభుఁడు
గదియవచ్చినఁ బఱచి రాక్షసుఁడె యనుచుఁ
బమ్మరింపుచు నేమేనిఁ బలుకుచుండ.

278


వ.

ఆభూపాలుం డాత్మకాంతకు భూతప్రవేశం బైనదని రక్షావిభూతు లరయుచో నేనొక యతినై రక్షోఘ్నమంత్రం బుపదేశించెదనని రాజునకు విన్నపంబు సేయించి యూరివెలుపలి పద్మాకరంబున మధ్యరాత్రి స్నానంబు సేయ వినియోగించి యప్పు డభ్భూపాలునిం జూచి యిట్లంటిని.

279


క.

నీమంత్రుల కెఱింగించి మ
హామంత్రము గొనుము దీననంగము నాత్మ
శ్రీమహిమ నొండు నని య
భ్భూమిపునకుఁ జెప్పి పనుపఁ బో యాసరసిన్.

280