పుట:సకలనీతికథానిధానము.pdf/127

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

121


తే.

తడవు నొక్కని మనమునఁ దలఁచు నొకని
వన్నె యొకనికి నొకనికి వలపుఁ జెప్పు
నింట నొకఁడుండ నొకని బొన్నింట(?) గలయు
వారవనితలఁ దెలియ నెవ్వారు గలరు.

330


క.

పెక్కుబొజుంగుల మెలఁపిన
యక్కామి యేలఁ దక్కు నన్యునకును దా
దక్కఁగఁ దలఁచిన పసిఁడికి
దక్కును నది లేకయున్నఁ దక్కకతక్కున్.

331


శా.

సాక్షా న్మన్మథుఁ గూడి యిష్టగతులన్ సంభోగముల్ సల్పినం
దాక్షిణ్యంబునఁ గూడియున్నతఱి భేదంబొంది హేమాంబరా
పేక్ష న్నిల్వ కుబేరునిం గలసి చూపెం గూర్మి కామాంధయై
దాక్షారామమునందు నొక్కసతికాంతల్ పేదకుం గూర్తురే.

332


వ.

అట్లు గావున ధనంబుదక్క దక్కినమోహంబులు లేవనిన విప్రుండు నవ్వుచుం జనియె నంత.

333


సీ.

జనపతిచెలికాఁడు చారాయణుఁడు రత్న
        సుందరిదూతితోఁ గందువెట్టి
యిరువురు జగడింప నింతు లిద్దఱుఁ గూడి
        తమలోనఁ దలపోయఁ దరుణి యోర్తు
పలికె నిట్లని భూమిపతిసఖుతోఁడ మే
        ఖల కేల కలహింపఁ గారణంబు
పోరినయిండ్లనుఁ బొరుగులు మనవని
        చెప్పెడుమాట నిశ్చితముగాదె


తే.

వీరిజగడంబు మాన్ప నెవ్వారితరము
సరట[1]గజయుద్ధమునఁ దొల్లి జైనపల్లె
తోఁడ గూడంగఁ గాసారతోయజములు
నాశమును బొందె ననిన నన్నాతి యనియె.

334
  1. సరట = తొండ