వ్యజానాత్
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము
అంకగణితము — గణితశాస్త్రములలో నెల్ల అంకగణితము మిక్కిలి పురాతనమైనది. పూర్వ మిది సాంఖ్య సిద్ధాంతముగా పరిగణింపబడుచుండెడిది. కాల క్రమమున సాంఖ్యసిద్ధాంత మొక ప్రత్యేక శాఖ యైనందున నేడు అంకగణితము, గణనక్రియకు, దాని అను ప్రయోగములకు సంబంధించినదిగా గుర్తించబడుచున్నది. సంఖ్యాక్రమ విధానము: ప్రాచీనజాతుల వారందరును మొట్టమొదట వేళ్ళలోనే లెక్కపెట్టెడివారు. సంఖ్యలను మాటలవలన తెలిపెడివారు. అంకములకు, సంఖ్యలకు ప్రత్యేక గుర్తులు లేకుండ పదములలో నే వ్రాయుచుండినచో, గణితశాస్త్రమే సంకుచితమై యుండెడిది. కనుకనే అంకములకు చిహ్నముల నేర్పరచు ఆవశ్యకము గల్గినది. చరిత్రకు తెలిసినంత వరకు సంఖ్యలను వ్రాయుటలో "ఫినీషియను" పద్ధతి మిక్కిలి పురాతనమయినది. వారు తొమ్మిదివరకు అంకెలను నిలువు గీతలచే తెలిపెడివారు. మన మిప్పటికిని కొన్ని నిర్దిష్ట కార్యములకై వాడు రోమను సంఖ్యలు, రోమనులు సంఖ్యాక్రమ నిరూపణమున గ్రీకులమార్గము నవలంబింపక వేరొక త్రోవ త్రొక్కిరి అని తెలుపును. రోమనుల సంఖ్యా సంకేతము లివి :
- I, II, III IV, V, VI, VII, VIII, IX, X, L, C, D, M.
- 1, 2, 3, 4, 5, 8, 7, 8, 9, 10, 50, 100, 500, 1000.
హిందువుల సంఖ్యాస్వరూపము (System of Notation) తదితర జాతులవారిదానికంటే భిన్నము. అంకగణితమున హిందువులు అత్యంతపురాతన కాలమున నే మిక్కిలి పరిశ్రమ చేసిరి. క్రీ. శ. 12 వ శతాబ్దినాటికే హిందువులు నవీన అంకగణితసారము నంతయు గ్రహించిరి. సంఖ్యావళియందు స్థాన భేదమును, సంఖ్యలేనిచోట సున్న పెట్టుటయు, సంఖ్యాతత్వ నిరూపణమునందు ధన, ఋణ సంఖ్యాభేదములును, కరణి, వికరణ్యంక (Irrational and rational quantities) వివక్షయు, మొట్టమొదట కనుగొన్నవారు హిందువులే. 11 వ శతాబ్ది ఆరంభమున అల్బెరూని యను మహమ్మదీయ చరిత్రకారుడు హిందువుల సంఖ్యావిధానమునుగురించి వ్రాయుచు, హిందూ దేశమున సంఖ్యావళిలో లి అంకెలును, ఒక సున్నయు నుండి, స్థానమునుబట్టి యేదేవి యొక సంఖ్య యొక్క మొత్తము పది రెట్లు హెచ్చుట గాని, తగ్గుటగాని కలదని వ్రాసియుండెను. మన దేశమున క్రీ. శ. 876లో సున్న వాడుకలో నున్నట్లు నిదర్శనములు గలవు. సంఖ్యాక్రమమున మనము వాడు అంకెలను గురించి, క్రీ. శ. 662 లోనే సిరియా దేశస్థుడగు సెవేరస్ సె బోల్తు అను నతడు ఇతర దేశములకు వెల్లడిచేసి యుండుట గమనింపదగినది.
సంఖ్యావళియందున్న అంకెలకు రెండర్థములుగలవు. మొదటిది అంకెల యొక్క గుర్తునుబట్టి కలుగుచున్నది.అనగా "4" అను సంకేతమునకు, "నాలుగు” అను అర్థము గుర్తువలన దెలియుట. ఇయ్యది సాంకేతికార్థము. ఇక రెండవ అర్ధము, ఈ యం కెలకే, స్థానభేదమువలన గలుగుచున్నది.
ఉదా : '5' గుర్తునకు ఐదని సాంకేతికార్థము. కాని '52' అను అంకములో, 'ఐదు' నకు స్థానమును బట్టి యేబది యను అర్థము కలుగుచున్నది. ఇట్లొక్కొక్క స్థానము హెచ్చిన కొలది, అంకెయొక్క విలువ పది రెట్లు చొప్పున హెచ్చుచుండును. మన సంఖ్యాక్రమమునందు