ఆంతర్వేది వసిష్ఠుని యనంతరము నృసింహ విగ్రహమొక పుట్టలో నణగియుండెను. కలియుగమున కేశవదాసను గొల్ల వాడు తన కపిలగోవు ప్రతిదినమును ఆపుట్టమీద తనపొదుగు పాలు విడుచుచుండుట చూచి అట త్రవ్వింపగా స్వామి విగ్రహము దొరి కెను. దానికతడు దారువులతో ఆలయము నిర్మించి పూజాదిక ము లారంభించెను. స్వామి పెక్కు మహిమలు చూ పెను. స్వామివారి అర్చాదులు నిర్వహిం చుటకు కేశవదాసు కొన్ని భూములను దానముచేసెను. కేశవదాసు నిర్మించిన కొయ్య గుడిస్తంభములు చక్కని శిల్పపు చెక్కడపుపనితనముతో నొప్పుచు, ఉక్కుస్తంభ ములవలె గట్టిగనున్నవి. ఈ దార్వాలయపు స్తంభము లును ప్రస్తుతపు శివాలయము ప్రక్కను భద్రపరుపబడి స్వామివారి పాకశాలగా నేర్పడియున్నది. కేశవదాసు పాలెమను గ్రామము నేటికిని అంతర్వేదికి సమీపమున నున్నది. కేశవదాస నిర్మిత దార్వాలయము శిథిలావస్థకు రాగా బెండమూర్లంక కాపురస్థులును, అగ్నికుల క్షత్రి యులును అగు కొపనాతి ఆదినారాయణగారు వర్ణాల యోద్ధరణమునకు పూనుకొనిరి. ఇసుకతప్ప ఏరాయియు దొరకని, యీ దూరసముద్ర ప్రాంతమునకు మహాలయ నిర్మాణమునకు గావలసిన శిలాస్తంభములును, రాళ్లును గొనిరాబడుట వింత. ఆదినారాయణ కొడుకు కృష్ణమ్మ. వీరు ఓడవర్త కము చేయుచుండిరి. ఆనాడు బెండమూర్లంక నుండి ఓడల మూలమున, బట్టలు మొదలగునవి సరకుల వర్తకము విదేశములతో జరుగుచుండెను. పోయినవను కొన్న ఓడలు నృసింహస్వామియనుగ్రహమున విశేష ధన సంపదతో తిరిగిరాగా కృష్ణమ్మగారు, తండ్రిసంకల్పించిన ఆలయమండపాదుల నిర్మాణము పూర్తిగావించిరి. ఈపని శాలివాహనశకము 1745 వ. సంవత్సరమునకు సరి యయిన క్రీ. శ. 1823 న ముగిసినట్లు ఆలయపు గోడ మీద నొక శిలాశాసనమున్నది. గర్భాలయముననున్న స్వామి విగ్రహము పశ్చిమ ముఖముగానుండును. గర్భాలయమునకు నెదుట దానికి జేరి బలమైన మండపములున్నవి. నృసింహాలయమునకు కుడిప్రక్కను రామాలయమున్నది. ఈయాలయ మండప ములందు గాఢాంధకారము నెలకొనియున్నను సాయం కాలమున పడమటనస్తమించు సూర్యుని కిరణములు 64 స్వామి విగ్రహ వక్షస్థలమున ప్రసరించి బంగరుకాంతు లతో వెల్గులీనుట రన్యుముగ నుండును. ఆ సొగసు ఆలయనిర్మాణమునం దేగలదు. స్వామి ఆలయమున కెడమ నైపున కల్యాణ మండపమున్నది. దీనికి చుట్టును నాల్గు వై పులను మండపమున్నది. పశ్చిమ ద్వారముమీది గోపు రముకాక, పది చుట్టుకో వెల లున్నవి. నృసింహస్వామి చుట్టును రాజలక్ష్మి తాయారు, వెంక టేశ్వరస్వామి, భూదేవి తాయారు, శ్రీరంగనాయకస్వామి, సంతాన గోపాలస్వామి, కేశవస్వామి, పన్నిద్దరాళ్వారులు, ఆంజ నేయస్వామి, శ్రీరాములవారు, గోవాలస్వామియు గలరు. వీ రందరును సన్నిధి దేవతలు. మండపములమీది విమా నములు కొన్ని గుండ్రముగను, కొన్ని కూచిగను ఉండును. నీలకం ఠేశ్వరస్వామి వారి కొక రెడ్డి ప్రభువు ఆలయము కట్టించెను. అది శిథిలము కాగా, దుడ్డు బాబయ్యగారను పేరూరు వాస్తవ్యులును, ఆత్మూరి చినతాతయ్య యను నరసాపురపు ఓడ వర్తకులును జీర్ణాలయోద్ధారము గావిం చిరి. ఈ యాలయము నేడు శిథిలమగుచున్నది. ప్రతి సంవత్సరమును మాఘ శుద్ధ దశమినాడు నృసింహస్వామి కల్యాణము జరుగును. ఏకాదశినాడు రథోత్సవమున స్వామి రథము గుఱ్ఱాలక్క గుడివరకు పోవును. వేలకొలది యాత్రికులు భీ మ్మైకాదశి మొదలు పూర్ణిమ వరకును ఉదయములందు సాగర సంగమ స్నానము గావించి పాపక్షయము నొందుదురు. ద్వాద శీతో కూడిన ఆదివారమున సముద్ర స్నానము పుణ్య ప్రదము. త్రయోదశినాటి రక్తకుల్యాస్నానము పీడా హరము. చతుర్దశినాడు చోరోత్సవము. పూర్ణిమనాడు స్వామి చక్రతీర్థస్నానముకొరకు సముద్రమున కేగును. ఆ స్థలమున స్వామివారు నిలుచుటకు కట్టబడిన మండ వము చక్కగనున్నది. పూర్వ మీ ప్రాంతము. గోల్కొండ నవాబు పాలనలో మండగా క్రీ. శ. 1582 సంవత్సర మున స్వామివారి చక్రము సముద్రములో కొట్టుకొని పోయెనట. ఎంత వెదకించినను చక్రము దొరకలేదు. అంత పేరూరు ద్రావిడ బ్రాహ్మణు లగు అంతర్వేది చయనులుగారు పదునొకం డహోరాత్రములు మంత్ర జపము చేయగా సముద్రుడు చక్రమును బ్రాహ్మ ణుని పాదములకడ జేర్చెనట. నాటినుండియు పేరూరి
పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/103
ఈ పుటను అచ్చుదిద్దలేదు
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2f/%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9_%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B0%95%E0%B1%8B%E0%B0%B6%E0%B0%AE%E0%B1%81_%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%AE%E0%B1%81_%E0%B0%85-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B7.pdf/page103-1024px-%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9_%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B0%95%E0%B1%8B%E0%B0%B6%E0%B0%AE%E0%B1%81_%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%AE%E0%B1%81_%E0%B0%85-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B7.pdf.jpg)