పుట:శ్రీ సుందరకాండ.pdf/54

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                 209
కొబ్బరితోటలు, గుబురు మొగలిపొద,
లుద్దాలకముల ఓలము లొరసెడి,
లంబగిరితలంబున వ్రాలె, మహా
త్ముండు మారుతసుతుండు కొండవలె.
                210
ఏటిగట్టున నొకింతనిలిచి హరి
గిరి సిగబంతిగ మెరయు లంకగని,
ఎగిరి దుమికె నా నగముమీద ప
క్షులు మృగములు కలగుండు గొని చెదర .
                 211
త్రుళ్ళి విరిగిపడు కల్లోలములకు,
నాగులకును, దానవులకు, నెలవగు
కడలిదాటి వెలిగట్టున దిగి, హరి
అరసెను లంకను అమరావతివలె.

43