పుట:శ్రీ సుందరకాండ.pdf/53

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 1

                   203
ఉదధిని, ఉదధి దిగుదల పల్లముల,
తేమ నేలల నెదిగిన వృక్షముల ,
పరికించుచు సాగరసంగ నదీ
నదముఖంబులను ముదముగ చూచెను.
                  204
శ్రావణ మేఘము చాయవిస్తరిలి
ఆకసమంతయు ఆముకొన్న తన
ఆకారము నవలోకించి మదిని
భావించెను మేధావి హనుమ యిటు.
               205
నా రూపోన్నతి, నావేగోద్ధతి,
చూచిరేని దనుజు లపూర్వంబీ
కపిభూతంబని కౌతూహలమున
విస్మితులై నా వెంబడి పడుదురు.
               206
అని, కొండను పోలిన తనరూపము
సంక్షేపించెను స్వల్పాకృతిగా;
మోహము వీడ ముముక్షువు ప్రకృతి
స్థితి కొనుగతి పొందెను నిజరూపము.
               207
పెంచిన రూపము దించి హనుమ, నిజ
వానరాకృతిని కానవచ్చె; మును
బలిబలము హరింపగ విష్ణువు మూ
డడుగుల పరిమితి ముడిగివభాతిని.
             208
పలురూపంబుల మెలగి, అన్యుల క
లవిగాని మహార్ణవము దాటి గ
ట్టెక్కి, కార్యము సమీక్షించి, అపుడు
సముచితమగు రూపము ధరించె, కపి,

42