పుట:శ్రీ సుందరకాండ.pdf/491

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 63

                  11
ప్రభువుతో నటుల వానరు డేమో
చెప్పుచుండ వీక్షించి, యథోచిత
ముగ సుగ్రీవు నడిగె కుమార ల
క్ష్మణుడు, వైరికులమారకు డిట్టుల.
                12
వాన రేశ్వర ! ఎవం డిత డిప్పుడు
ఏల వచ్చె నీ పాలికి ? ఏమి ని
వేదించుకొను? విషాదముఖుండయి,
వినదగు నే నది వివరింపుము ప్రభు !
                 13-14
లక్ష్మణు ప్రశ్నములకు సుగ్రీవుడు
ఇట్లనె, మిత్రమ ! ఇతడు దధిముఖుడు,
అంగద ప్రముఖు లైన వానరులు
తీపి త్రాగిరని తెలుపగ వచ్చెను.
                 15
దక్షిణదిశ నంతయును వెతకి రట,
తిరిగివచ్చి వానరు లందఱు, మధు
వనము చొచ్చిరట ; వారు కృతార్థులు
కాకున్న ఇటు లకార్యము చేయరు.
                  16
వచ్చీరాకయె వనమును చొచ్చిరి,
కావలివాండ్రను చావమోది, త్రా
గిరి మస్తుగ మాగిన మధువును; ఇవి
యెల్ల తఱచి ఊహింపగ తోచును.
                  17
పోయిన పని సంపూర్ణముగా సా
ధించిరి వీరలు, దేవిని సీతను
చూచియుందు రెచ్చోటనొ ? తథ్యము,
సందేహము లే దిందుకు లక్ష్మణ !

478