పుట:శ్రీ సుందరకాండ.pdf/487

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 62

                 34
మధువుమీది దుర్మమత కవశులై
ఆయుష్యము కోల్పోయి రీకపులు,
సుగ్రీవుడు నిష్ఠురముగ దండిం
చును మదాంధులను సుహృదుల తోడుత.
                  35
రాజాజ్ఞ లను తిరస్కరించిన దు
రాత్ము లెవరయిన హంతవ్యులు, వీ
రస్తమించిన కృతార్థమగును మన
క్రోధభూతమగు రోషజాతమును.
                 36
అట్లు దధిముఖుడు అనునయోక్తులను
ఓదారిచి, ఇక పోదము రండని,
తోటకాపరులతో శీఘ్రముగ ఎ
గిరిపోయెను సుగ్రీవు సన్నిధికి.
                  37
అటు లందఱు చద లంటుచుపోయి, ని
మేషములోన సమీపించి దిగిరి,
సూర్యసుతుండగు సుగ్రీవుండు వ
సించు వనాలయ సీమాంచలమున.
                 38
రముకులీనులగు రామలక్ష్మణులు,
సుగ్రీవునితో సుఖమున్న సమం
చిత భూమిని వీక్షించి, ఆకసము
నుండి దిగె దధిముఖుండు బలగమును.
                  39
ప్రథిత బలాఢ్యుడు, వనరక్షకులకు
అధిపతియు నయిన దధిముఖు డంతట,
వానర పరమేశ్వరుని అంతికము
చేరవచ్చె పరివార సమేతము.

474