పుట:శ్రీ సుందరకాండ.pdf/485

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 62

                    20
అనుచు స్వామి పలికిన పలుకులు విని
మధురక్షకులును 'మంచి' దను చపుడు,
మళ్ళిరి తోటకు కేళ్ళుఱుకుచు, అం
దఱు నేకంబుగ దధిముఖు వెంబడి.
                   21
దారి మధ్యమున దధిముఖు డొక వృ
క్షము పెకలించి, బుజాన పెట్టుకొని
బిర బిర పరుగిడె, భృత్యు లందఱును
అట్లె చేసి వెనకాడక నడచిరి.
                    22-23
మఱికొందఱు సంభ్రమమున మధ్యే
మార్గమం, దలవిమాలిన తాళ్ళను
ఱాళ్ళ నీడ్చుకొని త్రుళ్ళుచు పెల్లుగ
పరుగులెత్తి రురవడి బరవసమున.
                   24
వేలకొలది వనపాలకు లట్టుల
నేగి తోటలో అలసి నేలపయి
పడియున్న కపుల పై బడి తడయక
బిట్టుగ కొట్టిరి పెడమోఱకమున .
                   25
అది గని, దధిముఖు డాగ్రహించి వ
చ్చెనని మేలుకొని, హనుమత్ప్రముఖులు
పటువేగంబున పరుగిడి చేరిరి
వనరక్షకులను వాలాయింపగ.
                 26
పూజ్యుడైన దధిముఖుడు క్రుద్ధుడై
చేవ చెట్టొకటి చేతపట్టుకొని
వచ్చుచుండగని, వాలిసుతుడు ప్రహ
రించె నతని తన రెండు చేతులను.

472