పుట:శ్రీ సుందరకాండ.pdf/474

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                   31
గంపెడు కురు లెగగట్టి యొంటిజడ,
నేలమీద శయనించుచు, పతిపయి
ప్రాణములుంచి, వివర్ణ యై వనరు,
వడగం డ్లడచిన పద్మిని పగిదిని.
                  32
రావణాసురుని ఱాతిగుండె ద్రవి
యింప దనుచు మరణింప నిశ్చయిం
చిన మృగశాబాక్షికి, నేనెటులో
విశ్వాసము కల్పింప తలచితిని.
                33
మాటల వరుసన మైథిలితో యా
వద్వృత్తాంతము వల్లె చెప్పితిని,
సంతోషించెను జానకి, రాఘవ
సుగ్రీవుల ప్రస్తుతమైత్రిని విని.
                 34
సముదాచారము, సాధ్వీవృత్తము.,
విభుని యందె నిలిపి తపస్విని; రా
వణు బలిగొన దాయెను రఘురాముని
వల్లనె రావణు వధ కావలెనని.
                35
సహజసిద్ధముగ సన్నది జానకి,
దుఃఖవేదనల తూలి మఱింత కృ
శించి, కమలి, కనిపించెను; పాడ్యమి
నాటి చదువు చందమున మందగిలి.
               36
శోకసముద్రమున సుడిగుండంబుల
చిక్కి క్షోభిలెడి సీత కష్టకథ
చెప్పితి సర్వము, చేయతగిన, దిక
చింతించి వివేచింపుడు మీరలు.

27-8-1987

461