సుందరకాండ
18
బ్రహ్మయిచ్చిన వరంబుల మహిమను,
అమృతము త్రాగిన అక్షయ శక్తిని,
వెలుగు చుందురీ వీరు లిద్దరును,
హరి వంశంబున అగ్రగణ్యులయి.
19
అశ్విని దేవత లం దాదరమున,
ఇచ్చె మునుపె పరమేష్ఠి వరములను,
వీరి నిద్దరిని పోరుల నెవరును,
ఏ శరములును వధింప నోపవని.
20
బ్రహ్మదేవుని వరప్రభావమున,
మత్తిల్లిన ఈ మగ లిద్దరు, మును
దేవ గణము నతిక్రమించి, మన
సారగ త్రాగిరి వారి అమృతమును.
21
ఉండ నిండు కపియోధుల, వీరి
ద్దరును చాలు మాతంగ తురంగ ర
థాంగంబులతో అసురుల లంకను
సర్వనాశనము సలిపి జయముగొన.
22
ఇదివఱ కే దనుజేశుని లంకను
ధ్వంసముచేసి, భవనములు కాల్చితి,
రాజమార్గముల రచ్చల నెల్లెడ
వినిపించితి నా పేరుమ్రోయగా.
23-24
అనఘాత్ములకు, మహాబలిష్ఠులకు
జయము, రామలక్ష్మణ సుగ్రీవుల;
కనిలదేవునకు ఔరసపుత్రుడ,
హనుమాఖ్యాతుడ నంచు చాటితిని.
459