పుట:శ్రీ సుందరకాండ.pdf/451

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 58


                   49-55
పిడికిట పొడిచితి సడలగుండె, లం
తట, రక్కసి కాతరయై యిట్లనె,
"నేను లంకను, జయించితివి, నను, జ
యింతు విక అసురసంతతి నంతయు.”
                   ?
అంత నేను రేయంతయు లంకను
తిరిగి తిరిగి, మైథిలిని గానక, ద
శాస్యుని సౌధము నందును వెతకి, క
నబడక, శోకమున మునిగి సుడిసితి.
                  ?
చింతతో తపించెడి నాకపు డగ
పడె, బంగారపు ప్రాకారంబులు
చుట్టును కట్టిన సుందర కుసుమో
ద్యాన వనము నందనమును పోలుచు.
                  ?
ఆ ప్రాకారము నట్టె దాటి చూ
"చితి, నానా తరులతలు వర్ధిలు అ
శోక వనంబును, సుభగ శింశుపను,
పసిడి యనంటుల పచ్చని మళ్ళను.
                  56
శింశుప వృక్షము చేరుగడను చూ
చితిని మొదట, సితశతపత్రాడక్షిని,
వర్ణ వర్ణిని, ఉపవాస కృశాస్యను
నడివయసు నెలంతను సుమంగలిని.
                  57
ఒంటిచీర మెయినంట చుట్టుకొనె,
ధూసరంబులయి మాసె కేశములు,
శోకతాపమున సోలి కనబడెను
దేవతవలెను పతివ్రత మైథిలి.

438