పుట:శ్రీ సుందరకాండ.pdf/440

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                    ౩0
హర్ష పూర్ణుడయి హరివీరుడపుడు
తేటలారు సెలయేటినీట ది
గ్గన దుమికెను, ఱెక్కలుతెగ, మిన్నుల
నుండి దొరలిపడు కొండచందమున.
                   31-32
తోడులేక బహుదూరపు భూములు
వెతుకపోయిన కపిప్రవరుడు క్ర
మ్మఱి కుశలముగా అరుదెంచె ననుచు
ముదిత సుముఖులయి మూగిరి హరికడ.
                   33
మహనీయుండగు మారుతసూతి, కు
పాయనములుగా పచ్చిదుంపలును,
తీయని పండ్లును తెచ్చి సమర్పిం
చిరి, పూజించిరి, సేవించి రెలమి.
                   34
అపుడు మహాకపి, అనిలసుతుడు కుల
గురువుల పెద్దలకొలిచి, జాంబవం
తుని దగ్గరి వందనముచేసి, అం
గద కుమారునకు గౌరవము నెఱపె.
                   35
పూజ్యుడు హనుమను పూజించిరి పె
ద్దలు, భజియించి రితరవానరులును,
అపు డందఱువిన అతిసంగ్రహముగ
పలికె హనుమ 'చూచితి సీత' ననుచు.
                   36
అంతట హనుమ ప్రియంబున, వాలి కు
మారు నంగదకుమారుని కయి కయి
చేరిచి, చని చని కూరుచుండి రి
ద్దరు నొక్క మనోహర వనతలమున.

427