పుట:శ్రీ సుందరకాండ.pdf/433

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 56


                    23
ఉత్తరతీరము నుజ్జగించి, ద
క్షిణపారంబును చేరుటకయి, పెం
చెను దేహమునంతన హనుమంతుడు,
లవణార్ణవమును లంఘించెడు త్వర.
                    24
ఆ పర్వత శిఖరాగ్రమున నిలిచి,
అవలోకించె మహాకపి క్రమ్మఱ,
పాములతో చేపలతో త్రుళ్ళుచు
అతిభయంకరంబయిన సాగరము.
                   25-26
అంతన ఎగసెను హనుమ దక్షిణపు
దిక్కువిడిచి, ఉదీచిని దిగుటకు,
కాళ్ళత్రొక్కిడికి కెళ్ళగిల్లె గిరి,
భీతిలి మూల్గెను భూతగణంబులు.
                   27
హనుమ తొడల యూపునకు తల్ల డిలి
రాలిన పువ్వుల సాలంబులతో,
కంపించిన శృంగంబులతో, వ
జ్రాయుధ హతమైనట్లు వడకె గిరి,
                   28
కందరములలో కంఠీరవములు
కలగి కినిసి దిగ్భ్రమ గర్జింపగ,
విన వచ్చె త దాభీలధ్వని, ఆ
కాశము బ్రద్దలుగా పగిలిన గతి.
                   29
చీరలు జాఱగ, హార భూషణము
లల్లాడగ, విద్యాధరాంగనలు,
భీతి చెంది పృథ్వీతలము విడిచి
గగన వీధులకు ఎగసిరి బిరబిర.

420