పుట:శ్రీ సుందరకాండ.pdf/426

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                    18
జనకజ గతియించినదని విన్నన్
ప్రాణము విడుతురు రామలక్ష్మణులు,
వారిరువురు చన బంధుసహితముగ
సుగ్రీవుండు అసువులు త్యజించును.
                   19-20
భ్రాతృవత్సలుడు భరతుం డది విని,
శత్రుఘ్నునితో సమయును తోడనె,
ధర్మమార్గ తత్పరు లిక్ష్వాకులు
అస్తమింప ప్రజ లలమటింత్రు వెత.
                   21
ధర్మార్థములు యథాయథలై చెడు,
అటుమీదట నే హతభాగ్యుడనయి,
రోషమున జగద్ద్రోహము చేసిన
దోషపరీతాత్ముడనై నిలుతును.
                   22
అనుచు హనుమ బహుళానుతాపమున
దురపిలుచుండగ, తోచెను క్రమ్మఱ,
పూర్వ నిదర్శనములు, శుభ శకునము
లగపడె ఎడనెడ ఆస లిగుర్పక .
                  23
అదియుగాక, సర్వాంగ సుందరికి
జనక సుతకు రక్షకముగ కల దా
సాధ్వితపస్తేజము; కళ్యాణి న
శింపదు, వహ్ని గ్రసించునె వహ్నిని ?
                 24
ధర్మాత్ము, డనుత్తమతేజోనిధి
యగు రాముని జాయామణి, అనవ
ద్య చరిత, తపస్యావ్రతకవచను,
సీతాదేవిని స్పృశియించునె శిఖి ?

413