పుట:శ్రీ సుందరకాండ.pdf/422

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                   47
అసురనాయకుల హతముచేసి, వా
రిగృహాంగణములు తగులపెట్టి, పూ
దోటలబడి చెడత్రొక్కి, చేరె శ్రీ
రఘుపతిని మనోరథ యానంబున.
                  48
అంత, దేవగణ మంతయు మిక్కిలి
తుష్టిచెంది ప్రస్తుతు లొనరించెను,
వానర వీర ప్రవరుని,వాయు సు
తుని, మహాబలిష్ఠుని, హనుమంతుని.
                  49
చక్కని తోటను చదును చేసి, ర
క్కసులను రణమున ఉక్కడించి, సుం
దరమగు లంకను దగ్ధము చేసి ప్ర
కాశించె మహాకపి గజరాజము.
                  50
అప్పుడు సిద్ధులు, అమరులు, గంధ
ర్వులు మహర్షు, లటు బూడిదయై పో
యిన లంకానగరిని వీక్షిచుచు,
విస్మయ మందిరి విధిచోద్యంబని.
                  51
ఆ మహానగర హోమము సలిపిన
వానరసత్తము వాయుసుతో త్తము
కాంచి భూతములు కాలానలుడని
విభ్రాంతింబడి విస్మయమందెను.
                  52
సురలును, విద్యాధరులును, ముని పుం
గవులు, కిన్నరులు, గంధర్వు, లఖిల
భూతకోటియు, అపూర్వధీరమగు
హనుమ రూపు కను చానందించిరి.

409

.7-1967