పుట:శ్రీ సుందరకాండ.pdf/421

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 54


                   41
రథమాతంగ తురంగంబులతో,
వివిధ పక్షి మృగ వృక్షంబులతో,
కాలాగ్నింబడి కాలిన లంకా
పురి దీనముగా మూల్గుచు ఏడ్చెను.
                  42
అకటా ! తండ్రీ, అయ్యో కొడుకా !
హా కళత్రమా ! హా సుమిత్రమా !
పుణ్యార్జితమగు భోగ జీవితమ !
అని యేడ్చుచు, అల్లాడిరి అసురులు.
                  43
హనుమంతుని కోపాహతి హతమై,
అగ్నిజ్వాలల కాహుతిగా, చా
వగవీరులు వాలగ యోధులు, శా
పము కొట్టినగతి పాడఱె లంకయు.
                  44
దుర్విషాద భయధూతులయిన రా
క్షసులతో హుతాశనుడు దహింపగ,
ఉన్న లంక వాయుసుతు డీక్షించెను;
బ్రహ్మ కోపమున పడిన ధాత్రివలె.
                  45
పచ్చనితోటను పాడుచేసి, రా
క్షసయోధుల నని చక్కడించి, లం
కను కాల్చి, తనివికొనిన చందమున,
ఊరకుండె వాయుతనూజు డపుడు,
                 46
మూడుశిఖరములు మురిపించు త్రికూ
టాద్రిమీద సింహమువలె నున్న మ
హాకపి కనబడె అంశుమాలివలె,
జ్వాల లెగయు తనవాలము కదుపుచు.

408