పుట:శ్రీ సుందరకాండ.pdf/399

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 51

                  30
దానవుల జనస్థాన మారణము,
వాలి వధంబును, వానర పతితో
రాజకుమారుని ప్రాణస్నేహము,
మతి భావింపుము హిత మాశింపుము.
              31
రథమాతంగ తురంగతుముల మగు
సేనలతో లంకానగరము నా
శనము చేయ నే చాలుదు నొకడనె;
కాని రాము సంకల్పము కాదది.
              32
సీత నపహరించిన ద్రోహిని, తా
నె వధింతు ననుచు నిష్ఠించెను రఘు
నందనుండు వానరుల మ్రోల; ఆ
తడు తన శపథము తప్పడు తథ్యము.
            33
రామున కపకారము కావించిన
సాక్షా దమరస్వామి యేనియు సు
ఖంపబోడు, తర్కింప నేల నీ
వంటి నిశాచర పాంసను సంగతి.
            34
సీతపేర యే సీమంతిని నీ
వశమై యిచ్చట కృశియించెడి, ఆ
దేవి కాళ రాత్రినిగా నెఱుగుము,
లంకాపుర నాశంకరి ఆ సతి.
             35
సీతరూపు కయిసేసిన కాలాం
తకుని పాశబంధంబని తెలియక,
పట్టి నీ మెడను చుట్టుకొంటి, విక
ఆలోచింపుము ఆత్మక్షేమము.

386