పుట:శ్రీ సుందరకాండ.pdf/385

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 48

                  ?
కపియోధుని వల్కలముల కట్టుట
చూచి ఇంద్రజితు క్షుభితుం డాయెను,
మంత్రోక్తములగు మహితాస్త్రంబులు
పట్టివిడిచినన్ పాఱ వితరములు.
                  ?
చేసిన కార్య మిసీ ! నిరర్థకం
బాయె, ఎఱుగ రీ యసురు లొక్క ది
వ్యాస్త్రము విడిచిన అన్యాస్త్రము ప
ట్టదు; సందేహాస్పదమిక సర్వము.
                  51
అంత రాక్షసులు, హనుమ నీడ్చుకొని
పోసాగిరి రయమున; బందంబుల
రాపిడి వేదన లోపల తెలియక
పోయె మహాస్త్ర విమోచనము కపికి.
                 52
పిడి గ్రుద్దులతో పీడించుచు, క
ఱ్ఱలతో బాదుచు రాక్షసు లీడుచు
కొనిపోయి హనూమను నిలబెట్టిరి,
రాక్షసపాలకు రావణు మ్రోలను .
              53
అప్పు డింద్రజితు అస్త్రము క్తుడయి,
నార చీరె బందములతో మసలు
వానరుని మహాబలుని చూపె కొలు
వున నున్న దశాస్యునకు ప్రభువునకు.
              54
కదలకుండ బిగకట్టిన మదమా
తంగము బోని ప్లవంగవీరుని స
మర్పించిరి నాయకులును తోడనె,
రాక్షసరాజగు రావణేంద్రునకు.

372