పుట:శ్రీ సుందరకాండ.pdf/381

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 45


               23
సములగు వీరుల జంట డీకొనగ,
వేడుక చూడగ విచ్చేసిన ఋషి
నాగయక్షులు పెనంబడిరి చదల,
ఎలుగులెత్తి పక్షులు గలగలమనె.
              24
రథమునెక్కి అతిరయమున వచ్చెడి.
ఇంద్రజిత్తును సమీక్షించి హనుమ,
మితిమీఱగ తన మేను పెంచి గాం
డ్రించి నిగిడి గర్జించెను గట్టిగ.
               25
రావణు సుతుడును రథముపై నిలిచి,
చిత్రకార్ముకము చేతపట్టి టం
కారించె, ఘనాఘనములు ఉరిమిన;
కై వడి, మెఱుపులుగా శరము లెగయ.
               26
తీరణ వేగోద్రిక్త బలిష్ఠులు,
అని మొన వెనుకాడని శూరులు, రా
త్రించర వనచర ధీరులు తల
పడిరి సురాసుర బద్ద వైరమున.
               27
వీరపుత్రుడు మహారథికుడు వి
ఖ్యాతి గన్న విలుకాడు ఇంద్రజితు
పఱపిన శరములు వ్యర్థము చేసెను,
తక్కుచు నిక్కుచు చుక్కల త్రోవను.
            28
అరి లోకాంతకుడయిన ఇంద్రజితు
వానరవీరునిపై రువ్వెను బం
గారు కొనల ఱెక్కల నారసములు,
పిడుగుల వడితో మిడిసి మీదపడ.

368