పుట:శ్రీ సుందరకాండ.pdf/368

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                  29
జఁటమగల దుస్సహఘాతల మెయి
కుంచి కెరలి కుప్పించి, మహాకపి,
గరుడుని పగది, యెకాయెకివ్రాలెను
భూతలమున విపరీతవేగమున.
                  30
వ్రాలి, అటసమీపమున నున్న వృ
క్షప్రకాండము పెకల్చి కొట్టె; ఆ
వీరు లిద్దరును పీచమణగి భూ
శయనముగా విశ్రాంతిని పొందిరి.
                  31
మొదట దుర్ధరుడు, పిదపను యూపా
క్ష విరూపాక్షులు చావగ కనుగొని,
అసహనుండయి, ప్రఘసు డతిరయమున
మారుతాత్మజుని మార్కొనె చలమున.
                  32
మఱియొకవైపున మసలి క్రుద్దుడై
భాసకర్ణు, డతిభారమమున శూ
లముతో తాకె బలంబుగ, కపికుల
వీరు నటుల, ఊపిరి సలుపనిగతి.
                  33
ప్రఘసు డొకట యెగపార కురిసె, పద
నయిన కక్కుల ప్రహరణ ధారలను,
భాసకర్ణుడొకవంక శూలమును
త్రిప్పి త్రిప్పి కారించి కొట్టె వడి.
                  35
రాక్షసు లిద్దరు పక్కల నెదుటను
తెరపి యిడగ బాధించిన, నెత్తురు
కాఱు మేనితో కానవచ్చె హరి,
జ్వాలమాలికల బాలభానువలె.

355