పుట:శ్రీ సుందరకాండ.pdf/349

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 42


37
ఉబ్బి, హనుమ యటు బొబ్బలు పెట్టగ,
కింకర వీరులు గిలికొని శంకితు
లయి చూచిరి, సంధ్యా మేఘమువలె
ఉన్నతు డగు కపి యోధాగ్రేసరు.
38
అపుడు రావణుని ఆజ్ఞ తలపుకొన,
కింకర వీరులు శంకలు విడిచి, శ
రసహస్రంబుల ప్రహరించిరి వడి,
శాఖాచర మదశార్దూలంబును .
39
ఆయుధములతో అన్ని వైపులను
ముట్టి మార్కొనెడి పోతుమగల గని,
తట్టి పెకల్చెను ద్వారబంధమున
ఇనుపదూలమును హనుమ లీలగా.
40
గరుడి పాములను కసరివిసరు గతి,
ఆ మహాయసాయత పరిఘను, గిర
గిర త్రిప్పుచు కింకర సైన్యములను
మోదెను, చావగబాదెను బలముగ.
41
దానితోనె కపి తారాపథమున
కొంతసేపు తిరుగుచు, కింకరవధ
చవిగొలుప జిఘాంసారతి, క్రమ్మఱ
ద్వారతోరణము నారోహించెను.
42
పవననందనుని బాఱంబడి చా
వక మిగిలిన సైనికు లొక కొందఱు,
దశముఖుని దరిసి దాచక చెప్పిరి,
కింకర వాహిని ఇంకిపోయెనని.

336