పుట:శ్రీ సుందరకాండ.pdf/320

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ




                  44
ఆ వీరుడు నాయాతన లింత త
లంచి, జాలిని కలంగెనేని, ఇటు
లూరకుండ గానేల, వ్రాలిరా
క్షసులను క్షయలోకమునకు పంపడు.
                  45
రిపువాహినులకు గ్రీష్మతపనుడగు
లక్ష్మణు డమితబల ధురంధరు, డ
న్న యనుమతినిగొని నాశము చేయడు
కంటకులగు రక్కసుల నెందులకు ?
                  46
అగ్ని సమానులు, అనిల సంనిభులు,
తేజోజవశక్తి ప్రతాపు,లీ
పురుష వ్యాఘ్రంబులు సమర్థులై
ఏమిటి కిట్టు లుపేక్షింతురు నను.
                 47
చేసిన నా దుష్కృత మేదో కల
దతి బలవత్తరమైనది, తథ్యము;
లేకయున్న రిపులోక దాహకులు
బయిసిమాలి విడువరు న న్నీగతి.
              48
కనుల నశ్రువులు కాఱ దీనముగ,
కరుణ గద్గదస్వరయై పలికిన
వై దేహి విలాపము విని, కరగిన
మనసు చివుకుమన హనుమ యిట్లనెను.
               49
దేవీ! నమ్ము మీదే ఒట్టు తినెద,
రాముడు నీ పయి ప్రాణములన్నియు
పెట్టి, సర్వసుఖ విముఖుడాయె, ల
క్ష్మణుడు తపించు విషాదవేదనల.

307