పుట:శ్రీ సుందరకాండ.pdf/307

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 37


37.
మేరుపర్వతము మించి మందరా
చలము మించి అతిశయమగు రూపున
ప్రళయకాల తీవ్రములగు ప్రభలన్
నిలిచె హనుమ మైథిలి కట్టెదుటను.
38
విపరీతముగా పెరిగి కొండవలె,
రాగివన్నె తేఱగ మోమున, వ
జ్రములవంటి నఖములును కోరలు
గోరగింప, కపికుంజరు డిట్లనె.
39
కొండలు కోనలు, కోటలు తోటలు,
ప్రాసాదంబులు ప్రాకారంబులు
అన్నిటితో, అసురాధిపుతో, లం
కను సాంతము నే కొనిపోగలుగుదు.
40
దేవీ ! నీ సందేహము మానుము,
తేకువతో బుద్ధి నిలువరింపుము,
అపనయింపు మిసుమంత రామల
క్ష్మణుల తీవ్రతీక్షణ శోకంబును.
41
అని పలికెడి అనిలాత్మజు, పర్వత
సంనిభు, కపికుంజరమును చూచుచు,
పూచిన తామరపువ్వులవంటి వి
శాల నేత్రముల జానకి యిట్లనె.
42
తెలిసికొంటి హరికుల వీరాగ్రణి !
తావక బలసత్వ ప్రభావములు,
పవనుని వేగము భానుని తేజము
పొంది పొసగి నీ యందు పాదుకొనె.

294