పుట:శ్రీ సుందరకాండ.pdf/292

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                    86
ఎఱ్ఱని జీఱల నింపయి, తెలి తా
మర పువ్వులవలె మెరయు కనులతో,
తేటలారె మైథిలి ముఖబింబము;
గ్రహణము విడిచిన తుహినాంశునివలె.
                    87
ఎదుటనున్న వా డితరుడు కాడని,
వానరు డగు హనుమానుం డతడని,
తెలిసికొన్న మైథిలి ముఖ వైఖరి
నాకళించి మాటాడసాగె హరి.
                    88
చెప్పితి జరిగిన చెయిదము నంతయు,
ఊరడిల్లుము పయోజదళాక్షీ !
ఏమి చేయదగు నే నిక చెప్పుము,
ఎట్లు తోచె నీ కట్లు మెలగెదను.
                    89
నాడు మహర్షులు వేడుకొన్న నా
జనకుడు కేసరి చంపెను శంబుని,
అయ్యెడ పుట్టితి అనిలు నంశ, వా
నరుడ, ప్రభావమున అతనికి సముడ.

279