పుట:శ్రీ సుందరకాండ.pdf/286

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                  50
తరువాత, హరీశ్వరుడును, రాజ కు
మారు లిద్దరును చేరగవచ్చిరి
కిష్కింధకు వేగిరమె, యుద్ధమున
వాలిని బహుబలశాలిని కూల్పగ.
                  51
అవల, రాము డాహవమున వాలిని
పరిమార్చి, సకలవానర నర చ
క్రంబున కధిపతిగా సుగ్రీవుని
అభిషేకించెను శుభముహూర్తమున.
                  52
దేవి ! రామసుగ్రీవుల కట్టుల
అన్యోన్య స్నేహము సిద్ధించెను;
వారి దూతనయి వచ్చితి నిచటికి,
హనుమంతుడ, విఖ్యాత నామకుడ .
                  53
పోయిన రాజ్యము పొంది మఱల, సు
గ్రీవుడు సకల హరిప్రవరుల పిలి
పించి పంపె నిను వెతకుటకయి, పది
దిక్కులకు బలాధికులగు వారిని.
                  54
ఉగ్రశాసనుడు సుగ్రీవు డతని
శాసనమును శిరసావహించి నడ
కొండలు పోలిన గండు వానరులు
పోయిరి నీ అడపొడ గుర్తింపగ.
                  55
స్వామి వాక్యమును జవదాటని వా
నరుల మేము, తండములుగా బయలు
దేరినాము ధాత్రీచక్రంబును
గాలించుటకయి నాలుగు మూలల.

273