పుట:శ్రీ సుందరకాండ.pdf/284

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                     38
నీ యంగము లెడబాయక మెఱసిన
వాటి నన్నిటిని వానరులు వెతకి,
తెచ్చి రాఘవున కిచ్చిరి; వారికి
తెలియదాయె నిను తెచ్చిన మార్గము.
                     39
మింటినుండి భూమిని పడవేయగ,
మ్రోయుచు రాలిన నీ యాభరణము
లేనె తెచ్చితిని; వానిని చూచుచు
రాము డగలి మూర్ఛావశు డాయెను.
                    40
ఆ నగలను కని ఆదరంబుతో,
అక్కున నిడుకొని ఆవురుమని యే
డ్చెను భరియింపగ లేక, దేవ వ
ర్చస్కు డయిన రఘురాముడు పొరిపొరి.
                    41
మాటిమాటికిని వాటిని చూచుచు
పొరలి తెరలు వగపున వాపోయెను,
నిన్నెడ బాసిన నెవ్వగ పొగయుచు
నగలు చూడగనె రగిలి మండనగు.
                    42
అట్లు దుఃఖమున అవశుడైన రా
ఘవుని నేనె అతికష్టంబున, ఉప
చారవాక్యముల చాలసే పనున
యించి, తేర్చితిని యెట్లో దేవీ !
                   43
మఱమఱి తాకుచు మంగల్యములగు
సొమ్ముల నాదట చూచిచూచి, త
మ్మునికి చూపి, యిచ్చెను సుగ్రీవున,
కశ్రులు నిండగ ఆయతాక్షులను.

271