పుట:శ్రీ సుందరకాండ.pdf/283

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 35


                  31
వచ్చిన కార్యవివరము లన్నియును
వారల కెఱిగింపగ, ప్రీతులగుచు,
ఇరువురు కూర్చుండిరి నా వీపున
చేర్చితి కపికులశేఖరు చెంతకు.
                  32-33
అచట హరీశ్వరు డాదరమున భూ
వరసుతులను విశ్వాసముతో గొనె;
చెప్పుకొనిరి గడచిన తమ కథలను,
ఊరడిల్లి రొండొరులు ప్రీతులయి.
                  34
స్త్రీ మూలముగా జ్యేష్ఠ సోదరుడు,
అపహరించెను సమస్త రాజ్యమని,
శోచనీయమగు సుగ్రీవునికథ
విని ఓదార్చెను వెంటనె రాముడు.
                  35
చెప్పగ లక్మణు డప్పుడు రావణు
డపహరించె నిన్నడవిలో ననుచు,
సుగ్రీవుడు విని శోకించె, నిరప
రాధి రాముని దురంత విపత్తికి.
                  36
వానరపతి రామానుజుండు చె
ప్పిన దంతయు విని, వెలవెలబోవుచు,
నిస్తేజుండయి నిలిచెను; గ్రహణ
గ్రస్తుడయిన భాస్కరుని చందమున.
                  37
రాక్షసు డటు నిను గ్రక్కదల్చి, విను
వంక హుటాహుటి పఱచు సమయమున,
కోపతాపములనోప, కీ వొలిచి
తీసి క్రిందపడవేసిన సొమ్ములు.

270