సుందరకాండ
23
పులిపిల్లలవలె భూపకుమారులు
నాలుగుమూలల నేలను నీకయి
వెతకుచు తిరుగుచు విపినంబులలో
కలిసిరి మాతో తలవనితలపుగ.
24-25
అపహరింప రాజ్యంబు నగ్రజుడు,
వెఱచి పఱచి, బహువృత సాంద్రమగు,
ఋశ్యమూకగిరి పృష్ఠ భాగమున
చూచిరి ప్లవగేశుని సుగ్రీవుని.
26
అన్న రాజ్యమును ఆచుకొనంగా
ఆవలపోయిన ఆ సుగ్రీవ
స్వామి సన్నిధిని పరిచర్యల కే
ముంటిమి, అడవుల నంటిపట్టుకొని,
27-28
నారచీరలను నడుములను బిగిచి,
ధనువులు చేతుల తాలిచి వచ్చిన,
వారిని గని భయవశుడై దూకెను
వానరపతి పర్వతముపైకి వెస.
29
వానరేశ్వరుడు తాను పర్వతము
నెత్తమునందే నిలిచి శీఘ్రముగ,
నన్ను పంపెను వనాటుల వారల
చూచి విచారించుము నీ వనుచును.
30
అటు సుగ్రీవుడు ఆనతి యిచ్చిన
ప్రభువు పలుకులను పాలింపగ అతి
రూపలక్షణ సురుచిరులయిన నృప
శార్దూలంబుల సన్నిధి కేగితి.
269