పుట:శ్రీ సుందరకాండ.pdf/268

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                     29
జనపతి ఆ దేశము మన్నించి, దృ
ఢవ్రతులమయి వెడలి వచ్చితి మిటు
బుద్ధిపూర్వముగ; పూర్వము చూడని
గంభీరములగు కాంతారములకు,
                     30
దండక లోపల నుండగా మహా
బాహువు శ్రీ రఘుపతి పత్నిని నను,
కపటవేషమున అపహరించి కొని
వచ్చె నిచ్చటికి పాపి, రావణుడు.
                     31
కరుణించెను రాక్షసుడు రెన్నెలలు
ప్రాణముతోనే బ్రతికియుండుటకు,
రెండుమాసములు నిండిన వెంటనె
జీవితమ్మును త్యజింతు నిచ్చటనె.

257

25-4-1967