సుందరకాండ
17
అఖిల భోగభాగ్య సమృద్ధమయిన
ఇక్ష్వాకు నృపుల గృహముల, పన్నెం
డేండ్లు వసించితి ఇష్టకామ్యములు
తీఱ సుఖంబుగ గౌరవంబుతో.
18
పదుమూడవయేట దశరథేశుడు
రఘుకులనందను రాజ్యంబున కభి
షేకించ తలంచి,వశిష్ఠుని చో
దన నుపక్రమించెను విధియుతముగ.
19
శ్రీరాముని అభిషేక మహోత్సవ
సంరంభము లటు సాగుచుండగా,
భర్తారునితో బ్రాతిమాలి కై
కేయి యిట్లు పలికెను పరుషంబుగ.
20
నీళ్ళు త్రాగ, నిక నిత్యభోజనము
చేయను, మామక జీవిత వృత్తమె
అంతమగును వసుధాధిప ! శ్రీరా
ముని అభిషేకము పూర్ణమయినచో,
21
నృపసత్తమ ! నీవపు డిచ్చిన ప్రియ
వాగ్దానము తప్పక యిప్పుడు జరు
గన్ వలె, పోవలె కానకు రాముడు,
కావలె కాగల కారణార్థములు.
22
సత్యసంధు, డిక్ష్వాకు కులీనుడు
దశరథుడును మును తా నిచ్చిన వర
ములను స్మరింపుచు మూర్ఛపోయె, కై
కేయీ కఠినోక్తి ప్రహరముల.