సుందరకాండ
11
ఈ నిశాచరులు మానక కావలి
కాయుచుండ, జనకజతో భాషిం
చుట యుక్తముకా, దెటులీ దుస్సం
కటము గడుచునని కళవళపడె కపి.
12
మిగిలియున్న యామిని తుదిగడియలు
గడవక మునుపే కలిసి జానకిని
ఊరడించు టది యుచితము, లేకు
న్నను విడుచును ప్రాణములను తప్పక .
13
ఇంతదూర మే నేతెంచియు జా
నకిని పలుకరింపక వెళ్ళిన; అట
'నన్ను తలచి యేమన్న దామె' యన
నేమి చెప్పుదును రామచంద్రునకు.
14
జానకి సందేశము గై కొనక
తిరిగి వెళ్ళినన్ తీవ్రముగా కో
పించి చెచ్చెఱ దహింపవచ్చు రఘు
వీరుడు తీక్షణ వీక్షణంబులను.
15
రామ కారణార్థముగ నేను సు
గ్రీవుని ప్రభువును ప్రేరేపించిన,
దండు సాగు, నాతండు, సైన్యసం
రంభమెల్ల వ్యర్థంబయి ముగియును.
16
ఈ నిశాచరు లొకింత యేమఱిన
సందు చూచి, దుస్తాపజ్వాలల
తెరలుచున్న మైథిలి నల్లల్లన
ఓదార్చెద నిందుండియె కదలక .
239