పుట:శ్రీ సుందరకాండ.pdf/239

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 27



                  36
రక్తవస్త్రములు రక్తహారములు
తాల్చి, పొరింబొరి త్రాగిరి దైత్యులు,
కుంజ హయరథ గోపుర తోరణ
ములతో లంక సముద్రమున మునిగె.
                  37
రావణేశ్వరుడు రాజధానిగా
రాత్రిం దివములు రక్షించిన యీ
లంకను, రాముని లెంక వానరుడు
కాల్చుచుండగా కాంచితి కలలో,
                  38
నూనెలు త్రాగుచు దానవకాంతలు
శివమెత్తినగతి చిందులు త్రొక్కుచు,
అఱచుచు నవ్వుచు అదవద చొచ్చిరి
బూడిదయై పొలిబోయిన లంకను.
                   39
కుంభకర్ణుతో కూడ, దీటయిన
రాక్షస వీరధురంధరు లందఱు,
రక్తవస్త్రములు గ్రహియించి ప్రవే
శించిరి గోమయసిక్త తటాకము.
                   40
కావున నిక రాక్షసు లందఱు, వై
తొలగిపొండు, పోదురు నాశనమయి,
సీతను కలిసెను శ్రీ రఘురాముడు
రాక్షసకుల మారణ మొనరించును.
                   41
రామవునకు ప్రియురాలు, వనంబుల
విడనాడక సేవించెను, మన్నన
చేయు నతండును, సీతను తర్జిం
చిన మిము భర్జించును సహియింపడు.

228