పుట:శ్రీ సుందరకాండ.pdf/144

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                  59
తొలుత వందనము సలిపి రామ ల
క్ష్మణులకు, పరమసుజాతకు సీతకు,
రుద్రునకు, మహేంద్రునకు, పవన యమ
మరు దినసోముల కెఱగెద వినతిని.
                 60
పతిసుగ్రీవుని, పితను వాయు దే
వుని, స్మరించి, పావని పిమ్మట, అటు
పరికించుచు దిగ్వలయము, చూచె న
శోక వనాంచల శోభన చక్రము.
                 61
చూచి నిశ్చయించుకొనె హనుమ యిటు,
మునుముందుగ వనము ప్రవేశింతును,
కాగల రాగల కార్యకలాపము
నాలోచించెద నటు పిమ్మట నట.
               62
ఈ యశోకవన మేపున నున్నది
బహు వనపాదపబంధురమై, వన
పాలక రాక్షసభటజాలముతో,
కిటకిటమనుచుండుట సునిశ్చితము.
              63
పాలకులును కాపాడుదు రీ ప
చ్చని తోటను నిచ్చలు నిచ్చకమున,
పాదపములు సుడివడగా విసరడు
భగవానుండగు పవమానుండును.
             64
రామచంద్రు కార్యము సాధింపగ,
రావణుని ఉపద్రవ మరికట్టగ,
కాయము కుంచితి; కరుణింతురుగా
కిపుడు, దేవతలు ఋషిగణంబులును.

133