పుట:శ్రీ సుందరకాండ.pdf/143

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 13

                 53
మాకచ్చట సంపాతి చెప్పిన ప్ర
కార మపుడె రాఘవు నిచటికి కొని
వచ్చియున్న; ఇట భార్యను కానక ,
కాల్చి యుండు మా కపులనందఱిని.
                    54
కావున, నియతగ్రాసముతో, ఇం
ద్రియములను సమాధించి, ఇచటనే
నిలిచిపోదు, నావలన కాగల వి
నాశము తప్పును నరవానరులకు.
                   55
అదె, కనబడుచున్నది, శ్యామలతరు
సుందరంబుగ అశోకవనాంతము,
వీడించగలే దింతకు పూర్వము
పోయిచూతు నిప్పుడెయని సమకొని.
                 56
అసురలోక శోకావహముగ
మొదట దోయిలించెద, వసురుద్రుల,
కశ్విని మరుతుల, కాదిత్యులకు, అ
శోకవనంబును చూడబోవుతఱి.
                  57
రక్కసి మూకల చక్కాడెద, ఇ
క్ష్వాకువంశ సంవర్ధని సీతను
చేర్చి, సమర్పించెద రామునకు; త
పస్వి కిష్టసాఫల్యసిద్ధివలె.
                 58
అనుచు, హనుమ మహాతేజోనిధి
ధ్యాన స్తిమితుండయి, నిమేష, మిం
ద్రియములు కప్పిన తిమిరము విడిపోన్,
మేలుకొని విజృంభించె యథావిధి.

132