సుందరకాండ
35
ప్రభువుగతింప విపన్న ఖిన్నులయి
గొప్పవానరులు గుట్టలెక్కి పడి,
గోతులన్ దుమికి కూలుదురు, స్తనం
ధయకళత్ర బాంధవ సచివులతో,
36
ఉరులుపోసికొని, గరళముత్రాగి, ద
వానలమునబడి, అన్నపానములు
మానివేసి, దెసమాలిపోవుదు, ర
నాధలవలె వానరు లికమీదట.
37
కడముట్టును ఇక్ష్వాకులవంశము,
నశియించును వానరకులగోత్రము,
లెందుబోయినను ఏడ్పులు మూల్గులు
వినబడునని భావింతును మనమున.
38
కిష్కింధాపురికి తిరిగివెళ్ళను,
ఏమయినను సరె యిపుడు నేను; సీ
తాదేవిని సందర్శింపక, సు
గ్రీవుని ముఖమీక్షింపగజాలను.
39
వెళ్ళ కిచట నే వేగుచున్నచో
బ్రతికియుందు రిక్ష్వాకులు ధర్మా
త్ములు, మహారథులు తునుగని ఆశను,
కపిపుంగవులు పొకాలక నిలుతురు.
40
జానకి యెచటను కానరానిచో,
వానప్రస్థుడనై నిలిచెద నీ
చెట్లనీడలను, చేతికి నోటికి
అందిన శాకము లారగించుచును.
129