పుట:శ్రీ సుందరకాండ.pdf/123

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 11

                   18
అందెలు గొలుసులు సంది దండలును
ఊడిపడి మెఱయ నొకట, మఱొక్కట
పండ్లుపోసి పుష్పసరంబులు చు
ట్టిన మధురసకుండిక లింపారెను.
                   19
ధగధగమని రత్నాల మంచములు
ప్రజ్జ్వలింపగా పానభూమి దీ
పించెను, భగభగమంచు మండుచు
న్నట్టు లంతట అనగ్నిదగ్ధమయి.
                   20
చతురులయిన పాచకులువండి వా
సనకట్టిన మాంసములను విడివిడి
గా వడ్డించిరి కనకపాత్రలను,
పానభూమి శోభాయమానముగ.
                21
ఇప్పపూలమద, మిక్షుక్షీరము,
పండ్ల రసము, పుష్పముల మరందము
కాచి తేర్చి వడకట్టిన మద్యము
దొంతల బానల తొణుకుచునుండెను.
                22
పండ్ల నుండి, పుష్పములనుండి, ఇ
ప్పపువులనుండియు, పండిన చెఱకుల
నుండియు, చక్కెరనుండియు, ఆయ
త్తముచేసిన మద్యము లాసవములు.
               ?
తగిన సుగంధద్రవ్య చూర్ణములు
కలిపి సువాసన కట్ట మాగిన సు.
రాభాండములను శోభనవీధుల,
వేఱువేఱుగా వీక్షించెను కపి.

112