పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/88

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర ధ మా శ్వా స ము

51


   గురుతరాయుధ పరంపర చెంత నుండె, యో
          ధ తతి చిత్తములందు ధైర్య ముండె
          
గీ॥ నక్బరునకె కా దవ్వాని యబ్బకైనఁ
   దగ్గక రణంబు సాగింపదగ్గ యన్ని
   సాధనము లుండె, లేమి యెచ్చటను గలుగ
   దుదయసింహరాణా లేమి యొకఁడు తక్క.. 212 212
   
ఉ॥ అంగడి నున్నవన్ని శనియల్లుని నొరనటన్న మాట వా
    సిం గనఁజేసి యయ్యుదయసింహుఁడు యుద్ధమటన్న భీతిచేఁ
    గ్రుంగుచు ‘రాజపిప్పిలి'ని గోహిలువంశ్యులయొద్ద డాఁగె సై
    నం గనరాదు లోపము రణం బొనరించేడు యోధకోటికిన్. 213 213
    
సీ॥ అల సలుంద్రాధీశుఁడగు సాహిదాసు శౌ
          ర్వాన్వితుండగు దేవరాధిపతియు
    ఖేల్ల్వాప్రభువు శుద్దకీ ర్తి పుత్తనృపుండ .
          బేడ్లా తోటేరియా వృధ్వివరులు
    నింక మడేరియానృపతి చూడాసింగు
          పావనాత్ముండు ఝాలా విభుండు
    ఝూలూరినేత మీశ్వరదాసు సోనె గు
          ఱ్ఱేంద్రుఁడైన కరుణా సాంద్రరాజు
          
గీ॥ గ్వాలియరు దేశపతి లోసుగా మహిపులు
   పగిలేడు పిరంగి గుండుకు వక్షమిచ్చు
   ధైర్య హేమాద్రులు విశేషదళము లలరఁ
   బోయి నిల్చిరి గెలుపొ చావో యటంచు. 214 214
   
క॥ అల్ల యమభటుల గేరేడు
   బల్లిదులగు భటులు గొలువవైరుల మనముల్
   తల్లడిలఁగ వచ్చెను జయ
   మల్లుఁడు రణరంగపార్ధమహిత యశుండై. 215 215
   
సీ॥ ఇతఁడు మార్వార్మహీపతి మాళదేవుని
               సుతుఁడు బాల్యమునందె శూరలోక