ప్ర ధ మా శ్వా స ము
49
--/ అక్బరు - దిగ్విజయములు / --
క॥ కొనె మేత్రాదుర్గము, చే
కొనె గోగ్రోటన్ కోట యింక గోవిందివనం
బను దేశము గెలిచెను గో
టను నాగ్రాపురమునన్ దృఢముగఁ గట్టెన్.200
క॥ శరణని మాళవపతి దరి
కరుదేరఁగఁ గూర్మిగని సహస్ర హయాధీ
శ్వర సేనాధీశుగ నా
దరమున నాస్థానమున నతనిఁ జేర్చుకొనేన్.201
క॥ తపతీనదిపైఁ గల బ్ర
హ్మపురంబును విజయగృహము నతిరయమారన్
నృపకుల దీపకుఁ డక్బరు
కృపకును లోనగుదు మనుచుఁ గ్రేళ్ళురికె వడిన్.202
క॥ రావలపిండి సమీపము
లో విలయాంతకునకైన లొంగని గక్కా
రావీరుల కావర ముడి
వోవఁగఁ బంజాబు దేశమును గెల్చుకొనెన్.203
క॥ తూరుపుసీమల దృష్టిని
సారింప నడేల్ కులుండు చానార్ దుర్గ
ద్వారములు దీసి యక్సరు
భూరమణుని పాద కమలములు పూజించెన్.204
క॥ నరసింగపూరు చౌరా
ఘరు మఱిహోరంగబాదు క్రమమొప్పఁగ న
కృరు పాదుసాహి చరణాం
బురుహంబులు శరణమనుచుఁ బొగడుచు నిలిచెన్.205 205
క॥'రండో వీరోత్తమ' యని
ఖాండీషు నృపుండు కాళ్ళు గడిగి తనూజన్