పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర ధ మా శ్వా స ము

25




గీ॥ శీఘ్రముగ నీపదంబులుచేర వచ్చి
    నాఁడ' నన నెల్లరపుడు సంతసము నొంది
    రీతఁ డఱువదియును నాలుగేండ్ల దాఁకఁ
    బాలన మొనర్చె నవల మేవాడసీమ. 96

చ॥ అతనికుమారుఁడున్ మనుమఁడౌ లఘుఁ, డవ్వల రాజులౌచు శా
    శ్వత బహుళాభివృద్ధి కొనసాగఁగ నేలిరి దేశమున్ లఘు
    క్షితిపతి 'జావురా" ఖనులసీసము వెండియు లోనుగాఁగ ధా
    తుతతులఁ ద్రవ్వఁజేసి తఱితో ధనరాసులఁ జేర్చె మెండుగన్. 97
    
మ॥ జనకుం డాడిన యొక్క మాటకయి తత్సామ్రాజ్యమున్ దాని ప
    జ్జను లావణ్యనిధానమై వెలయు హంసాదేవినిన్ వీడి, త
    మ్ముని రారాజు నొనర్చి భీష్ముచరితంబున్ దాఁబ్రదర్శించేఁ జం
    డనృపుం డీలఘురాజు పుత్రుఁడు ప్రచండప్రాభవోద్దండుఁడున్. 98
    
క॥ ముకుళుఁడు లఘురాజు కుమా
    రకుఁ డాతని వెనుక నేలె రాజ్యము తత్పు
    త్రకుఁడగు విదళిత రిపుహ
    స్తి కుంభుఁడౌ కుంభనరపతి శ్రేష్ఠుండున్. 99 99
    

మహారాణా కుంభుని పరిపాలనము.



మ॥ జనముల్మెచ్చఁగ నేఁబదేండ్లితఁడు రాజ్యంబేలె: మేవాడ్ధరి
    త్రిని నయ్యెన్పదినాల్గు కోటలను ద్వాత్రింశస్మహాసంఖ్య యీ
    తనిచే నిర్మిత మయ్యె; నన్నిఁటఁగడున్ దార్ధ్యంబు వైశాల్యమున్
    గొని యవ్వీర వతంసుపేర నిలుచుఁ గుంభల్ మియర్ దుర్గమున్. 100
    
సీ॥ మాళవపతి మహమ్మద్ ఖిల్జి వార్ధి త
              రంగముల్ వలెఁ జతురంగ బలము
    గొలువ ఘూర్జర రాజుఁ గూడి దండెత్తి రా
              నొక లక్ష యుత్తమాశ్విక దళంబు
    పదునాల్గు వేలుకాల్బలముతో నరుదెంచి
              యెదిరించి వారి జయించి మాళ్వ
    ధరణీశుఁ దన రధ స్తంభంబునకుఁ గట్టు
              కొనుచుఁ జిత్తూర్పురంబునకుఁ దెచ్చి