14
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
ర్వమహీనాధులు వాని సాహసములు వర్ణించి తత్తన్ని వా
సములన్ జేరఁ బ్రయాణమైరి త్రుటిలో సంరంభ శూన్యస్థితిన్ 48
మ॥ 'అకటా! గర్భనిరోధి దుష్టుఁడు శరుండౌ పృథ్విసింహుండు క
న్యకఁగొంచున్ జనె మోసగించి పెనువంతన్ సైపఁగాఁజాలఁ ద
ప్పక వానిన్ దెగటార్చి నాయునురు నిల్వన్ బెట్టరే' యంచు నో
పికజాఱన్ జయచంద్ర భూవిభుఁడు తబ్బిబ్బొంది వాపోయినన్. 49
సీ॥ ఆబూ ధరాధీశుఁడగు జయత్ప్రమరుండు
ప్రబలుండు మండూరు వ్యాఘ్రరావు
కాన్యకుబ్జంబు లక్ష్మణసింగు విశ్వేశ
సింహవిభుండు కాశీధరాధి
పుఁడు మహోబానేత పూర్ణమల్లుండు ధా
రామహీపాలుండు రామసింహు
డాలాయు మదిలుండు నాజయచంద్రుండు
మదినమ్ము వాఁడిఁటి మాడుఖానుఁ
గీ॥ డొక్కొకరుఁ డై దువేలమంది యోధులఁగొని
త్వరితగతి బయల్దేఱి రవ్వారికెల్ల
సర్వసేనాధిపతి యౌచు జగ మద్రువఁగ
ముందుఁ గదలె బోళాభీమ భూవిభుండు. 50
సీ॥ మూఁడునాళ్ల ప్రయాణమున డస్సియుండె , జో
హణనేన దాని సంఖ్యయుఁ గొలంది
పైఁ జిచ్చుటెండ లోపల మండుకొనుక్షుధ
వీని మించుచుఁ గ్రొత్త పెండ్లికొమరి
తను సున్నితముగాఁగఁ గోనిపోవవలయు భా
రము కాన్యకుబ్జ సైన్యము లపార
మవ్వాని నడపు నాయకులు పెక్కురు భీముఁ
డుద్దండతర విక్రమోగ్ర మూర్తి