పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/48

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర ధ మా శ్వా స ము

11


    యము నల ధర్మనందనుని యవ్వలనీ జయచంద్రుఁ డొక్కఁడు
    క్కు మిగిలి చేయనేర్చె నృపకోటి యొనర్ప సమస్త కార్యముల్. 36

గీ॥ అవలఁ దన పెంచు సంయుక్తయనెడు కన్య
    పరిణయ మొనర్పఁగా స్వయంవరముఁ జాటి
    సకల దిగ్దేశవర్తి రాజన్యులకును
    బంపె వైవాహి కాహ్వాన పత్రములను.37
    
సీ॥ తనకెకాదింక భూస్థలి రాజులకు నెల్లఁ
           బెద్దయౌ రారాజు పృధ్వీరాజ
    మౌళి కాహ్వాన మంపమి యట్టులుండ హా
           స్యమునకై యొక పెద్ద యట్టచేత
    నామహాప్రభు విగ్రహము రచింపించి సే
           వకు దుస్తు లిడుచు నుద్వాహమండ
    పము మహాద్వారంబు పరగడ మోడ్పుచే
           తులతోడఁ దలవాల్చి నిలువఁజేసె
           
గీ॥ నల స్వయంవరాహూతులై యచటఁ జేరు
   భూమివతులెల్లఁ దుచ్ఛమౌ బొమ్మఁ జూచి
   సంభ్రమాశ్చర్య చకితులై చాలఁ దడవు
   నిలిచి రనిమేషులగుచు బొమ్మల విధాన.38
   
సీ॥ "నృపమకుటములు తన్ని జనించె నామహా
              భాగు సేవకుఁజేయఁబాడి గాదు
     భువనోన్నత ప్రాభవుండైన మేటి యా
              తని కెగ్గుచేయుట తగవుగాదు
     రణరంగ ఫల్గుణ ప్రఖ్యాతి గల వీర
             మౌళి నొప్పరికింప మేలు గాదు
    శ్రీరమారమ ణావతారు జగద్వంద్యు
             నవమాస మొసరింప ననువు గాద