పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/47

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర



సీ॥ "ఇరువుర మేము దౌహిత్రులమైయుందు
            మప్ప నెల్లెండ్రకు నాత్మజులము
    పదియు నెమ్మిది యేండ్ల ప్రాయ మందున్న నన్
            వదలి యెనిమిదేండ్లవానిఁ బృథ్వి
    సింహాసనాసీనుఁ జేయుట ధర్మ మీ
            తని యధికార మే ననుమతింప
    నాక్షేపణ మొనర్తు”నని ధిక్కరించి యా
            జయచంద్రుఁ డేగెనాసభను వీడి
            
గీ॥ యతనివెంట నాబూపర్వతాధికారి
   వ్యాఘరాజేంద్రుఁడును బట్టణాధినాధుఁ
   డసమబలుఁడు భోలాభీముఁడా క్షణంబ
   కదలిపోయి రాస్థానరంగంబు వదలి.34
   
సీ॥ తుహినాద్రినుండి సేతువుదాఁకఁ దనరు న
           ఖండ భారతఖండ మండలంబు
    సకల మేకచ్ఛత్ర సామ్రాజ్యముగ ధరి
           త్రీ రాజ్యమేలెఁ బృధ్వీనృపాలుఁ
    డా వీరనరు సహస్రాదిక యుద్ధముల్
           ధర్మసంస్థాపన తత్పరతయు
    నతని సామంత ధరాధీశ్వరుల భూరి
           పౌరుష విక్రమ ప్రాభవములు
           
గీ॥ చంద్రభట్టారక సుకవి చక్రవర్తి
   వ్రాయు శతసహస్రాధిక గ్రంధమందు
   రససమృద్ధిని బర్వపర్వంబునకును
   జీవకళ లుట్టిపడఁగ రంజిల్లు చుండు.35
   
   -: సంయుక్తా స్వయంవరము :-
   
చ॥ అమిత విశాలమై సిరు లనంతముగాఁగల కాన్వకుబ్జ రా
    జ్యము మును దక్షిణాపధమునందును వ్యాపన మొందె రాజసూ