శ్రీ
కా మే శ్వ ర్యై న మః
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
ద్వి తీ యా శ్వా స ము
మ॥ వరసౌఖ్యంబులకు నిరోధమగు నేర్పాటుల్ దొలంగించి సు
స్థిరత బెంచు వ్యవస్థలన్ దీటముగాఁజేకూర్చుచున్ సత్య ధ
ర్మరతుల్ మీఱఁగ రాజ్యమేలు కొనుచు రాణాప్రతా పావనీ
శ్వర మందార మొకానొకప్పుడు సలుంద్రాభర్త నీక్షించుచున్. 11
సూక్తసింహుని రాజధాని కంపుమని ప్రతాపసింహుడు కృష్ణసింహు నర్థించుట.
మ॥ "మొదలన్ నెత్తురు పంచుకొంచునుజుఁడై పుట్టొందె , నాపైన బా
ల్యదశన్ బైనను బ్రక్కనున్ బడుచుఁ దుల్య ప్రేమతో మైత్రికా
స్పదమై వర్తిలె సూక్తుఁ డొక్కటి నన్ బాయం డొకప్డైనఁ ద
ల్లిదరిజేరఁడు ప్రాణ మొక్కఁడు డల్ రెండైన యట్లుండెడిన్ .2
గీ॥ రాము నుపమ నాయెడఁ బల్కరాదు గాని
ఱెప్పవాల్పక కనుపెట్టిరేయుఁ బవలు
ననుచరుండయి నన్గొల్చునపు డతఁడు ని
జంబు మూఁడుమూర్తులకు లక్ష్మణుఁ డెసుమ్ము. 3
గీ॥ సూర్యవంశ ప్రదీపుఁడౌ సుతు విపత్తుఁ
బాపి కాపాడి తనుచు నీభవ్య యశము
నలుదెసలఁ బ్రాకె సూక్తుఁ డనంతకోటి
జన విజయ సూక్తుఁడగుదుఁ దేజమునఁ బెఱిఁగె. 4