86
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
మ॥ ఇది నాయాజ్ఞి బహిష్కరించితిని నిన్నీ దేశమం దెచ్చటన్
మెదలన్ బోకన సాగరుండు నగి స్వామి చాల సంతోషమై
నది! రాజ్యం బది యెంత తీపనుచు డెందంబందు దావించితో
విదితంబయ్యె సమస్త భూజనులకున్ బెక్కేల వాక్రువ్వఁగన్.387
మ॥ ఇది నాయూ రిది నాదు రాష్ట్రమనున్ హీనుల్ మఱిన్ దుర్బలుల్
మది సూహింతురు కాని విక్రమకళాలంకారులౌ వారి క
య్యుద యాస్తాచల మధ్యగం బయిన సర్వోర్వీతలంబున్ ముదా
స్పదమౌ కొంగుపసిండి వోలెఁ దమదై భాసిల్లు నెల్లప్పుడున్. 388
మ॥ పరమ ప్రాభవ సంపదల్ విడిచి మేవాడ్దేశ మందుండఁగా
నెరియున్ నామది నీవు శత్రుఁడగుటన్ నీవారలున్ శత్రులౌ
దురు నీకెప్పుడు గర్భశత్రువులు మిత్రుల్ నాకు నట్లౌట మ
చ్చరణంబుల్ క్షణకాలముంచుదుఁ జరించన్ నీదు రాజ్యంబునన్. 389
సీ॥ పనియేమి పరభూమిపతుల సీమలకేగ
మేవాడ నెపుడెప్డు మ్రింగుదునని
కనువైచియుండు నక్బరు ధరామండలా
ఖండలుం డాతని కడకుఁ బోదుఁ
ద్వద్వికట ప్రవర్తనమున నతనికి
మిత్రలాభముగల్గు మేర యొదవె
నిప్పుడు పయనించి యేగెద ఢిల్లీపు
రమునకుఁ గొన్నిదినముల లోన
గీ॥ హెచ్చరిక గల్గి రాజ్యంబునేలు చుండు
మిదియె శాశ్వత మనియుండకెప్పు డెవ్వ
డెచట నేరీతి నిన్ను జయించి దాని
నపహరించునో తెలియఁబోదజున కైన. 390
మ॥ అని గాంభీర్య మెలర్పఁగా బలికి యశ్వారూఢుఁడై పోయె నా
తని వీక్షించుచుఁ గొంతసేపటికి యోధశ్రేష్ఠలున్ బెక్కురున్
దనవెంటన్ జనుదేర నయ్యెడ నరణ్యప్రాంతమున్ జేరఁగాఁ
జనే వేఁటాడఁ బ్రతాపసింహుఁడు జనుల్ సంతోషమున్ బొందఁగన్.391