పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/55

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రబంధరాజ వేంకటేశ్వర

6


ప్రతిజ్ఞాదికము

వ. అని నిఖిల దైవతాచరణంబును, ఆచార్య చరణ స్మరణంబును, సుకవి బహూకరణంబును కుకవి
    నిరాకరణంబునుం గావించి

క. సాహసమునఁ గృతి సేయఁగ
   నూహించితి రసికసుకవి యూధము విని సం
   దేహము గలిగిన నధిక
   స్నేహమ్మునఁ దీర్చి మేలుఁ జేకొనవలయున్. 18

[1] తే. గీ. తప్పుగలిగిన చోటనె యొప్పుగలుగు
    సరస కవితా చమత్కార సరణియందుఁ
    గప్పుగలిగిన నీహారకరుని వలన
    నమృతధార ప్రవృద్ధమై యలరినట్లు 19

తే. తప్పులనితోఁచునవియేల్ల యొప్పులగును
    మధుమధుర మత్కవిత్వ చమత్కృతిఁ గన
    రీతిరీతిగఁ గన్పట్టు జాతికనక
    మొరయఁబదియాఱు వన్నెయై యున్నయట్లు. 20

క. ప్రతిపద్యంబుఁ జమత్కృతి,
    బ్రతిపదమును బ్రౌఢి మివులఁ బరగిన కృతి స
    త్కృతిగాక జల్లిమాటల
    యతకడపుం దడిక సభల కర్హంబగునే 21

క. మునివచనంబుల లెస్సగఁ
    దెనుఁగించెద మనుచు వానిఁ దెలియక బెనుప

  1. ఈ పద్యము తెనాలిరామకృష్ణుని పాండురంగమహాత్మ్యమున నిట్లుండినది. “తప్పుగల్గినచోటనే యొప్పుగల్గు | నరసికావళి కవితల యవగుణములు | సరసకవితావశోక్తుల సరణియందు | నమృతధారా ప్రవాహంబు లడరుఁ గాదే” (1.14) ‘అవగణములు... లడరు' అని యనన్వితము. “యవగుణముల సరసఁ గవితా' యని పఠించిన సరిపడును” అని మా తాతగారు విమర్శ వినోదములో వ్రాసినారు. చూ. 51.