38
శ్రీ దేవీ భాగవతము
క. ఆ మువ్వురు శక్తుల కా | మై మేనుల లక్షణంబు లాఖ్యాతములై
భూమిన్ మించెను సృష్టికి | నై మానిత సర్గశాస్త్రహారుల చేతన్ | 27
క. ఆమీఁదట విష్ణుండు పితామహుఁడును భూతపతియుఁ దగఁ బొడముటయే
వేమఱు సృష్టి స్థితి లయ సామగ్రికి నై యొగిఁ బ్రతి సర్గం బయ్యెన్|28
తే.గీ. అమృతకర భానుసంభవులైన యట్టి క్షత్రియుల వంశములు స్తుతి సలుపు టెల్ల
నల హిరణ్యకశి ప్వాది కులము లెన్నఁబడుట వంశం బటందు రెప్పుడును బుధులు ||29
క. స్వాయంభువ ప్రభృతి మను | నాయక వంశప్రకీర్తనంబును గాల
వ్యాయామము లెెన్నుటయును | న్యాయత మన్వంతరంబు లందురు పెద్దల్ |30
క. మనువంశంబులఁ జెప్పుట | యనయము వంశానుకీర్తనాఖ్యం బయ్యెన్
వినుఁ డిట్లు పంచలక్షణ | మనబడియెఁ బురాణపఙ్తి యార్యులచేతన్ ||31
క. వర భారతేతిహాసము | పరఁగంగ సపాదలక్ష పద్యాన్వితమున్
విరచించె వ్యాససంయమి | ధరఁ బంచమ వేద సమ్మతం బది నుండీ ||32
వ. అనిన నాలించి హర్షోత్కర్ష మానసుండై శౌనకుం డిట్లనియె.33
తే.గీ. ఆ పురాణోత్తమము లెవ్వి యవ్వి యెంత | సంఖ్యకలయవి తెలుపవే సంయమీంద్ర
యయ్యది సవిస్తరంబుగ నాలకింపు | శ్రవణములు గోరు రోమహర్షణతనూజ |34
క. కలికాలభీతులము మే మలఘుస్థితి నిందు నైమిిశారణ్యమునన్
మెలఁగుదుము బ్రహ్మయానతి | దలఁపడి నిరవధిక సౌఖ్య తంత్రజ్ఞులమై ||35
క. మాకిచ్చె గృపామయుఁడై : లోకేశుఁడు చక్రమొకటి లోలత నిదియే
మీకుం బావన భూమిన్ | వీఁకఁ దెలుపఁగలదు దీని వెంటం జనుఁడీ || 36
క. ఇది సంశీర్ణం బగు నే | పదమున నది పావనంబు పట్టదు కలి యా
పదమున నుండుండీ కలి | తుదదనుకన్ సత్య యుగము తోఁచెడి నంతన్ ||37
క. అని పద్మజుండు సెప్పిన | విని మే మందఱము దాని వెంటం జనఁగా
ననుపమ చక్రం బందఱు , కనుచుండఁగ శీర్ణ మయ్యెఁగద యిచ్చోటన్ ||38
తే.గీ. కాననే యిది నైమిశ కాననాఖ్యఁ బడసె బరమ పవిత్రమై పరఁగె నిందుఁ
గలి ప్రవేశింపఁ డెపుడును గాన నేను నందఱు తపస్వులను గూడి యింద యుందు ||39
ఆ.వె. కృతయుగంబు దనుక నేజాడ నేనియుఁ గాల మపనయింప గలుగు మాకు
వేడు కలరగా బురోడాశముఖముల | సవనములు పొసఁగు పశువులు లేక|| 40
క. మాపుణ్యంబుననేకద | ప్రాపించితి నీవు ధన్యభావం బొదవన్
మాపాలఁ గలిగి తెలుపవె | తాపసపరః బ్రహ్మ సమ్మిత పురాణంబున్ || 41