పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/81

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

శ్రీ దేవీ భాగవతము

క. ఆ మువ్వురు శక్తుల కా | మై మేనుల లక్షణంబు లాఖ్యాతములై
   భూమిన్ మించెను సృష్టికి | నై మానిత సర్గశాస్త్రహారుల చేతన్ | 27

క. ఆమీఁదట విష్ణుండు పితామహుఁడును భూతపతియుఁ దగఁ బొడముటయే
   వేమఱు సృష్టి స్థితి లయ సామగ్రికి నై యొగిఁ బ్రతి సర్గం బయ్యెన్|28

తే.గీ. అమృతకర భానుసంభవులైన యట్టి క్షత్రియుల వంశములు స్తుతి సలుపు టెల్ల
   నల హిరణ్యకశి ప్వాది కులము లెన్నఁబడుట వంశం బటందు రెప్పుడును బుధులు ||29

క. స్వాయంభువ ప్రభృతి మను | నాయక వంశప్రకీర్తనంబును గాల
   వ్యాయామము లెెన్నుటయును | న్యాయత మన్వంతరంబు లందురు పెద్దల్ |30

క. మనువంశంబులఁ జెప్పుట | యనయము వంశానుకీర్తనాఖ్యం బయ్యెన్
   వినుఁ డిట్లు పంచలక్షణ | మనబడియెఁ బురాణపఙ్తి యార్యులచేతన్ ||31

క. వర భారతేతిహాసము | పరఁగంగ సపాదలక్ష పద్యాన్వితమున్
   విరచించె వ్యాససంయమి | ధరఁ బంచమ వేద సమ్మతం బది నుండీ ||32

వ. అనిన నాలించి హర్షోత్కర్ష మానసుండై శౌనకుం డిట్లనియె.33

తే.గీ. ఆ పురాణోత్తమము లెవ్వి యవ్వి యెంత | సంఖ్యకలయవి తెలుపవే సంయమీంద్ర
    యయ్యది సవిస్తరంబుగ నాలకింపు | శ్రవణములు గోరు రోమహర్షణతనూజ |34

క. కలికాలభీతులము మే మలఘుస్థితి నిందు నైమిిశారణ్యమునన్
   మెలఁగుదుము బ్రహ్మయానతి | దలఁపడి నిరవధిక సౌఖ్య తంత్రజ్ఞులమై ||35

క. మాకిచ్చె గృపామయుఁడై  : లోకేశుఁడు చక్రమొకటి లోలత నిదియే
   మీకుం బావన భూమిన్ | వీఁకఁ దెలుపఁగలదు దీని వెంటం జనుఁడీ || 36

క. ఇది సంశీర్ణం బగు నే | పదమున నది పావనంబు పట్టదు కలి యా
   పదమున నుండుండీ కలి | తుదదనుకన్ సత్య యుగము తోఁచెడి నంతన్ ||37

క. అని పద్మజుండు సెప్పిన | విని మే మందఱము దాని వెంటం జనఁగా
   ననుపమ చక్రం బందఱు , కనుచుండఁగ శీర్ణ మయ్యెఁగద యిచ్చోటన్ ||38

తే.గీ. కాననే యిది నైమిశ కాననాఖ్యఁ బడసె బరమ పవిత్రమై పరఁగె నిందుఁ
   గలి ప్రవేశింపఁ డెపుడును గాన నేను నందఱు తపస్వులను గూడి యింద యుందు ||39

ఆ.వె. కృతయుగంబు దనుక నేజాడ నేనియుఁ గాల మపనయింప గలుగు మాకు
   వేడు కలరగా బురోడాశముఖముల | సవనములు పొసఁగు పశువులు లేక|| 40

క. మాపుణ్యంబుననేకద | ప్రాపించితి నీవు ధన్యభావం బొదవన్
   మాపాలఁ గలిగి తెలుపవె | తాపసపరః బ్రహ్మ సమ్మిత పురాణంబున్ || 41